సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్బవించింది. అందుకే దీనిని గతంలో ‘బ్రహ్మసరం’ అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు త్రీవమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తుంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతులకోసం సృష్టించాడని పురాణ కథనం.
ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాలపాటు సాగింది. అదే సమయంలో ఆ పన్నెండేళ్ళపాటు ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గ్రదాపుల్లోని జలవనరులన్నే ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీనది దాకా వెళ్ళాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులో నుంచి ఓ బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజులు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, ‘జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే’ అని సంకల్పం చెబుతుంటాం. ఈ జంబూ ద్వీపం అఖండభారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.
ఈ పేరు రావడానికి వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు ‘జం’ అనే శబ్దం వస్తుందేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జమ్బూద్వీపమనే పేరు రావడానికి కూడ కారణం మానస సరోవరమనేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మారం ఓ కథను చెబుతుండటం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనులు ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధగ్రంథాలు మానస సరోవరాన్ని అనోతత్త అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులు, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వులు ఆ పువ్వులపై కూర్చోనేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.
మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ పేడు వరుసల్లో చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షంఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటూండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకొని బంగారంగా మారాయిని చెబుతుంటారు.
ఈ మానస సరోవరం శక్తి పీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51 శక్తిపీఠాలలో మానస సరోవరం కూడ ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉందంతాన్ని విన్న పరమశివుడు ఆగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞవాతికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, ఆ తల్లి కళేబరాన్ని భుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరుగసాగాడు. ఫలితంగా లోకాన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్నిముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు కుక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
మానస సరోవరాన్ని తాకినా, స్నానామాచారించినా బ్రహ్మలోకం చేరుకున్తారానీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడంవల్ల పితృ దేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు, ‘ఓం’ ఆకారంలో ఉంటుండటం విశేషం.
ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాలపాటు సాగింది. అదే సమయంలో ఆ పన్నెండేళ్ళపాటు ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గ్రదాపుల్లోని జలవనరులన్నే ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీనది దాకా వెళ్ళాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులో నుంచి ఓ బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజులు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, ‘జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే’ అని సంకల్పం చెబుతుంటాం. ఈ జంబూ ద్వీపం అఖండభారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.
ఈ పేరు రావడానికి వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు ‘జం’ అనే శబ్దం వస్తుందేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జమ్బూద్వీపమనే పేరు రావడానికి కూడ కారణం మానస సరోవరమనేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మారం ఓ కథను చెబుతుండటం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనులు ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధగ్రంథాలు మానస సరోవరాన్ని అనోతత్త అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులు, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వులు ఆ పువ్వులపై కూర్చోనేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.
మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ పేడు వరుసల్లో చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షంఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటూండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకొని బంగారంగా మారాయిని చెబుతుంటారు.
ఈ మానస సరోవరం శక్తి పీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51 శక్తిపీఠాలలో మానస సరోవరం కూడ ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉందంతాన్ని విన్న పరమశివుడు ఆగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞవాతికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, ఆ తల్లి కళేబరాన్ని భుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరుగసాగాడు. ఫలితంగా లోకాన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్నిముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు కుక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
మానస సరోవరాన్ని తాకినా, స్నానామాచారించినా బ్రహ్మలోకం చేరుకున్తారానీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడంవల్ల పితృ దేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు, ‘ఓం’ ఆకారంలో ఉంటుండటం విశేషం.
No comments:
Post a Comment